నా పేరు రాయనప్పుడు నన్నెందుకు పిలిచి అవమానిస్తున్నారు: మహిళా ఎంపీ

by Dishanational1 |
నా పేరు రాయనప్పుడు నన్నెందుకు పిలిచి అవమానిస్తున్నారు: మహిళా ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: శిలాఫలకంపై తన పేరు లేదని, అలాంటప్పుడు తననెందుకు పిలిచారని ఓ మహిళా ఎంపీ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... జార్ఖండ్ ఆదిత్యపూర్ లోని జామ్ సెద్ పూర్ లో ఎన్ఐటీ హాస్టల్ భవనాలకు నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మహిళా ఎంపీ గీతా కోడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై తన పేరు రాయనప్పుడు తనని పిలిచి ఎందుకు అవమానించారని, ఒక మహిళా ఎంపీని గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదంటూ ఆమె ఎన్ఐటీ సంబంధిత అధికారులపై ఆమె సీరియస్ అయ్యారు. ఆమె అనుచరులు కూడా కార్యక్రమం వద్ద ఆందోళన చేపట్టారు.



Next Story