‘ఇండియా’తో బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదు.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సెటైర్లు

by Dishafeatures2 |
‘ఇండియా’తో బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదు.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో భాగంగా ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకులకు నిద్రలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు పార్లమెంట్ లో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.

ఇక మణిపూర్ అంశంపై మాట్లాడకుండా ప్రధాని మోడీ ఇండియా కూటమిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఓ చరిత్రగా మాత్రమే మిగులుతుందని ఆయన సెటైర్లు వేశారు. కాగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.

Next Story