విషెస్ చెప్పిన ప్రధానికి మణిపూర్ వెళ్లే టైం లేదా?: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

by Dishanational2 |
విషెస్ చెప్పిన ప్రధానికి మణిపూర్ వెళ్లే టైం లేదా?: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిన ప్రధానికి రాష్ట్రంలో పర్యటించే సమయం దొరకలేదా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. గతేడాది నుంచి మణిపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని మోడీ.. విషెస్ చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో హింస కొనసాగుతున్నప్పటికీ కేంద్రం మౌనం వహించడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ‘మణిపూర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. భారతదేశ ప్రగతికి మణిపూర్ బలమైన సహకారం అందించింది. అని మోడీ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. కాగా, గతేడాది మే 3వ తేదీ నుంచి రాష్ట్రంలో మెయితీ, కుకీ తెగల మధ్య అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed