నష్టనివారణ చర్యల్లో భాగమే ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిలపక్షం: జైరాం రమేశ్

by Naga Rani Yarlagadda |

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు.

నష్టనివారణ చర్యల్లో భాగమే ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిలపక్షం: జైరాం రమేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో ఈ విధంగా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని దుయ్యబట్టారు. 2014 వరకు అఖిలపక్షాన్ని ఐక్యరాజ్యసమితికి పంపించి భారత్ వాణిని వినిపించే సంప్రదాయం ఉండేదని , ఆ సంప్రదాయాన్ని మోదీ ఆపివేశారని జైరాం రమేశ్ విమర్శించారు.

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంచుకున్న బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో 7 టీమ్స్‌ను ఏర్పాటు చేసి విదేశాలకు పంపాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ రగడ మొదలైంది. ఎవరెవరిని పంపాలన్న విషయంలో ఎంపికలను పార్టీలకే వదిలేసి ఉండాలని కొందరు అనగా.. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

Next Story