- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా రిజర్వేషన్లపై ఏప్రిల్ 15న కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశం.. ఖర్గే కీలక ప్రకటన
మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ చట్టం అమలు విషయమై భాగస్వాములందరితో విస్తృత స్థాయి చర్చలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
చర్చలకు కేంద్రం విముఖత
బెంగళూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఖర్గే.. మహిళా రిజర్వేషన్ల చట్టానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇది జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అంశం కాబట్టి దీని అమలుపై లోతైన చర్చలు జరగాల్సి ఉందన్నారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేనందునే.. తామే స్వయంగా ఏప్రిల్ 15న ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక లక్ష్యమని, గతంలో సోనియా గాంధీ సైతం ఈ అంశాన్ని బలంగా వినిపించారని ఖర్గే గుర్తుచేశారు. అప్పట్లోనే పంచాయతీలు, కార్పొరేషన్లలో రిజర్వేషన్లు అమలు చేశామని, ఈ విషయంలో తమకు ఎవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా.. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో సవరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఖర్గే పేర్కొన్నారు.






