ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. సీఎం కీలక ఆదేశం

by Disha Web Desk 13 |
ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. సీఎం కీలక ఆదేశం
X

థానే: ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 55 ఏళ్లు పైబడిన ట్రాఫిక్ పోలీసులకు రోడ్ డ్యూటీని కేటాయించొద్దని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు. రోడ్లపై ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసులకు నీడ, తాగునీటి వసతిని కల్పించేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అదనపు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. ఈమేరకు మహారాష్ట్ర కమీషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ ఫన్సల్కర్‌కు సీఎం ఏక్‌నాథ్ షిండే బుధవారం ఆర్డర్స్ ఇచ్చారు.

"ఇటీవల నేను థానే నుంచి ముంబైకి ప్రయాణిస్తున్నప్పుడు మండుటెండలో డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులను చూసి చలించిపోయాను. వాళ్లలో 55 ఏళ్లకు పైబడిన వాళ్ళు కూడా ఉండటం బాధ కలిగించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఏక్‌నాథ్ షిండే తెలిపారు.


Next Story

Most Viewed