మీడియా బాధ్యతారాహిత్యంపై సీజేఐ అసహనం: విచారణ తిరస్కరణ వార్తలు పచ్చి అబద్ధం!

by Malleboina Mahesh |

విద్యార్థుల ఆందోళనల పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ నిరాకరించారనే వార్తలు అబద్ధమని, కోర్టులో పిటిషనే దాఖలు కాలేదని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టత.

మీడియా బాధ్యతారాహిత్యంపై సీజేఐ అసహనం: విచారణ తిరస్కరణ వార్తలు పచ్చి అబద్ధం!
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ (Baton charge) చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే లాఠీ ఛార్జ్ వీడియోలను చూసేందుకు సమయం లేదని సీజేఐ అన్నట్లు పలు వార్తలు, సోషల్ మీడియాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఈ తప్పుడు వార్తలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టులో అసలు ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాకుండానే, సీజేఐ విచారణను తోసిపుచ్చారని ప్రసార సాధనాల్లో తప్పుడు కథనాలు రాయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కోర్టు వేదికగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ..

"గడిచిన రెండు రోజులుగా ఒక పిటిషన్ దాఖలైందని, దానిని విచారించడానికి చీఫ్ జస్టిస్ నిరాకరించారని మీడియా అత్యంత బాధ్యతారాహిత్యంగా, బాధ్యత లేకుండా కథనాలు ఇచ్చింది. ఈ ఉదయం 10 గంటల వరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై ఒక్క పేజీ పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఎవరో మిశ్రా అనే న్యాయవాది పంపిన ఒక సాధారణ విజ్ఞప్తి/లేఖ (Representation) మాత్రమే ఉంది. ఒక లేఖను నేను రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణించగలను? అసలు నిజాలు తెలుసుకోకుండా మీడియా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కథనాలు ప్రసారం చేయడం సరికాదు" అని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుపై ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మి కథనాలు రాయవద్దని, బాధ్యతాయుతమైన వార్తా సేకరణ ఉండాలని మీడియా రంగానికి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా హితవు పలికింది.

Next Story