దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు CJI చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు CJI చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు అసలు విషయాన్ని వదలి కొసరు విషయాలపై దృష్టి పెడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీబీఐపై కేసుల భారం పెరుగుతోందని అన్నారు. దేశ రక్షణ, ఆర్థిక స్కామ్‌లపై కాకుండా ఇతర కేసులపై దృష్టి పెడుతున్నారని చురకలు అంటించారు. మరోవైపు ఇవాళ జ్ఞానవాపి మసీదు కేసులో చంద్రచూడ్ కీలక తీర్పు వెలువరించారు. జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఇరువైపుల వాదనలు విన్న సీజేఐ.. ప్రస్తుతానికి రెండు వర్గాల ప్రార్థనలు యథావిధిగా కొనసాగించుకోవచ్చని వెల్లడించారు. మసీదు దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవడానికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సైతం సమర్థించింది.

Next Story

Most Viewed