- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేంద్రం కీలక నిర్ణయం: అయోధ్య ఎయిర్ పోర్టుకు 150మంది సీఐఎస్ఎఫ్ కమాండోల కేటాయింపు
by Dishanational2 |
X
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి 150 మందికి పైగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మంజూరు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయోధ్య ఎయిర్ పోర్టుకు వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. దీనిని గతేడాది డిసెంబర్లో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి తాజాగా భద్రతను కేటాయించడం గమనార్హం. కొత్త ఎయిర్ పోర్టును సందర్శించే యాత్రికులు, సందర్శకులకు ఎటువంటి ముప్పు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి ప్రతి గంటకు రెండు నుండి మూడు విమానాలను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది.
Next Story