- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పేద ఖైదీలకు ఆర్థిక సాయం.. పెనాల్టీ, బెయిల్ అమౌంట్ కట్టలేనివారికి లబ్ధి
by Harish |

X
న్యూఢిల్లీ: పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పెనాల్టీలు, బెయిల్ అమౌంట్ కట్టలేని ఖైదీలకు లబ్ధి చేకూరేలా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రక్రియను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిష్కారాల ద్వారా పేద ఖైదీలు ప్రయోజనం పొందేలా చూస్తామని వెల్లడించింది. దానికి తగినట్లు ఈ-ప్రీజన్స్ వేదికను పునరుద్ధరించడం తో పాటు జిల్లా న్యాయసేవల వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపింది. సమయానికి తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమైన మార్గదర్శకాలను పంపిస్తామని పేర్కొంది.
Next Story