ఓటీటీలకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రూల్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ

by Disha Web Desk 4 |
ఓటీటీలకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రూల్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి చేయాలని ఓటీటీలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పొగాకు వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పాలుపంచుకోవాలని సూచించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే...సదరు పబ్లిషర్‌పై మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్రం హెచ్చరించింది.





Next Story

Most Viewed