రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

by Disha Web Desk 2 |
రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని 2028 వరకు పేదలకు ఉచిత రేషన్ బియ్యం బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. కాగా కరోనా టైమ్ లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచితంగా అందజేస్తోంది.



Next Story

Most Viewed