వాయు కాలుష్యంపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

by Disha Web Desk 2 |
వాయు కాలుష్యంపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
X

దిశ, డైనమిక్ బూరో: ఇబ్బందికరంగా మారుతున్న వాయు కాలుష్యంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు. చలికాలంలో కాలుష్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Next Story

Most Viewed