దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వంటగ్యాస్‌ కొరతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పదిశాతం గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా కొన్ని నగరాల్లో తీవ్రంగా తగ్గింది. ముఖ్యంగా ముంబయి, బెంగళూరు, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీని గృహేతర విభాగాల్లో ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గడం హోటల్, ఆహార పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదనంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ప్రధానంగా గృహ వినియోగానికి మళ్లించాలని కేంద్రం ఇప్పటికే ఆయిల్ మంత్రిత్వ శాఖకు సూచించింది.

Next Story