- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈవీఎంలపై సీఈసీ సంచలన నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
బిహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: బిహార్ (Bihar) ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవీఎం (EVM)లపై ప్రస్తుతం అభ్యర్థుల ఫొటోలు, పార్టీ గుర్తులను బ్లాక్ అండ్ వైట్ (Black & White)లో ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇక నుంచి వాటి స్థానంలో కలర్ ఫొటో (Color Photos)లను ఏర్పాటు చేయనున్నారు. బిహార్ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందిన కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఈవీఎం వ్యవస్థపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు లేవనెత్తుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఓటర్లకు పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థి స్పష్టంగా కనిపించేలా ఎలాంటి అవకతవకలకు తావు లేదంటూ ఈవీఎంలపై కలర్ ఫొటోలను ముద్రించాలని నిర్ణయించామని సీఈసీ (CEC) స్పష్టం చేసింది.
Next Story






