వచ్చే ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షలు రద్దు: సీఎం

by Disha Web Desk 9 |
వచ్చే ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షలు రద్దు: సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే సంవత్సరం(2024) విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. 10వ తరగతి బోర్డు పరీక్షలకు బదులుగా పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అలాగే 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అస్సాం - అస్సాం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లను కూడా కలుపుతామని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. ఈ నిర్ణయంతో వచ్చే సంవత్సరం నుంచి అస్సాం రాష్ట్రంలో 10వ తరగతి బోర్డు ఎగ్జామ్ లేకుండానే విద్యార్ధులు ఇంటర్‌లోకి వెళ్లనున్నారు.


Next Story