ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు.. జైలు నుంచి సిసోడియా సందేశం

by Disha Web Desk 6 |
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు.. జైలు నుంచి సిసోడియా సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా ట్విటర్ వేదికగా స్పందించారు. జైల్లో పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు.

‘సర్.. మీరు నన్ను జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టగలరు. కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిషర్లు కూడా స్వాతంత్య్ర సమరయోధులను ఇబ్బందులకు గురిచేశారు. వారి స్థైర్యాన్ని కదిలించలేకపోయారు. జైలు నుంచి సిసోడియా సందేశం’అని ట్వీట్ చేశారు. కాగా, శుక్రవారం సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. లిక్కర్ స్కాంలో సిసోడియాది ప్రత్యక్ష పాత్రే అని వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సిసోడియాను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరోవైపు సీబీఐ కేసులో సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది.



Next Story

Most Viewed