- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘అక్కడ ప్రతి రోజు బ్లాక్ అవుట్’.. ఆదేశాలు జారీ

దిశ,వెబ్డెస్క్: భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు(india-Pakistan conflict) మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నెల(మే) 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్రస్దావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి భారత్, పాక్ మధ్య కాల్పులు, వైమానిక దాడులు చోటుచేసుకుంటున్నాయి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్యానా(Haryana)లోని అంబాలలో ప్రతి రోజు బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) రాత్రి 8 గంటల నుంచి ఉదయం(రేపు) 6 గంటల వరకు ప్రతి రోజు బ్లాక్ అవుట్(Black Out)కు నిర్వహించాలని అంబాల(Ambala) కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, పవర్ బ్యాకప్ పరికరాలు వినియోగించ వద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో లైట్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను అపేయడాన్ని బ్లాక్ అవుట్ అంటారు.