‘అక్కడ ప్రతి రోజు బ్లాక్ అవుట్’.. ఆదేశాలు జారీ

by Jakkula Mamatha |
‘అక్కడ ప్రతి రోజు బ్లాక్ అవుట్’.. ఆదేశాలు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు(india-Pakistan conflict) మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నెల(మే) 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్రస్దావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి భారత్, పాక్ మధ్య కాల్పులు, వైమానిక దాడులు చోటుచేసుకుంటున్నాయి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్యానా(Haryana)లోని అంబాలలో ప్రతి రోజు బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) రాత్రి 8 గంటల నుంచి ఉదయం(రేపు) 6 గంటల వరకు ప్రతి రోజు బ్లాక్ అవుట్‌(Black Out)కు నిర్వహించాలని అంబాల(Ambala) కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, పవర్ బ్యాకప్ పరికరాలు వినియోగించ వద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో లైట్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను అపేయడాన్ని బ్లాక్ అవుట్ అంటారు.



Next Story

Most Viewed