భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు: రాజ్‌నాథ్ సింగ్

by Harish |
భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని, రిజర్వేషన్లను తొలగించదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుందని, రాజ్యాంగ ప్రవేశికను కాషాయ పార్టీ మార్చాలని చూస్తుందని ఇటీవల ఆరోపిస్తుండగా, దానికి సమాధానంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ 1976లో, భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారని, కానీ ఇప్పుడు అనవసరంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్దాలు చెబుతున్నారని ఆయన అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ, అవసరమైనప్పుడు రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేయవచ్చు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దీన్ని ఇలా చాలా సార్లు చేశారు. కానీ పీఠికలో మార్పులు చేసే ప్రశ్న లేదు. కాంగ్రెస్ మాత్రం మార్పులు చేసి ఇప్పుడు మాపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది, బీజేపీ దాని గురించి ఆలోచించడం లేదని మంత్రి తెలిపారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని చింపి, పారేస్తుందని, పీఠిక నుండి "లౌకికవాదం" అనే పదాన్ని తొలగిస్తారని కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇలా అన్నారు.

కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించే ఆలోచన అధికార పార్టీకి లేదని, అయితే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఎప్పటికీ ఇవ్వబోమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్‌ను ఎందుకు అంతం చేస్తాం.. ఈ దేశంలో ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి.. కానీ ప్రతిపక్షాలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని చెబుతున్నాం. దీనిని అనుమతించం అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Next Story

Most Viewed