ఢిల్లీ సీఎంపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

by Dishafeatures2 |
ఢిల్లీ సీఎంపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నగరంలో మౌళిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఢిల్లీ సీఎం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. బుధవారం వరద నీటిలో మునిగిన మయూర్ విహార్ ఫేజ్ 1 ఏరియాలో గౌతమ్ గంభీర్ పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దాదాపు 1000 నుంచి 1500 మంది వరదల్లో చిక్కుకున్నారని తెలిపారు. వారందరినీ రక్షించేందుకు పడవలను పంపించాలని తాను డీఎమ్ కు చెప్పినట్లు పేర్కొన్నారు. వరదల్లో చిక్కకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు.

Next Story