ఒడిశాలో ఆ పార్టీతో బీజేపీ పొత్తు !

by Dishanational4 |
ఒడిశాలో ఆ పార్టీతో బీజేపీ పొత్తు !
X

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా మంగళవారం ఒడిశాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేవలం ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. తన ప్రసంగం ద్వారా కాంగ్రెస్ పార్టీపై గురిపెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ)పై కానీ.. ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్‌పై కానీ మోడీ ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. రానున్న రోజుల్లో బీజేడీకి బీజేపీ చేరువ కాబోతోందనే దానికి ఇదే పెద్ద సంకేతమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఒడిశాలోని మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగానూ 12 చోట్ల బీజేడీ, 8 చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌కు ఒక స్థానంలో గెలిచాయి.


Next Story

Most Viewed