ఢిల్లీ పేలుడులో ట్విస్ట్.. బ్లాక్ డే రోజు భారీ పేలుళ్లకు స్కెచ్

by Muthe.Rajitha |

ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.

ఢిల్లీ పేలుడులో ట్విస్ట్.. బ్లాక్ డే రోజు భారీ పేలుళ్లకు స్కెచ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న కొత్త కొత్త షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్రణాళిక రూపొందించారు ఉగ్రవాదులు. దీపావళితోపాటు, గణతంత్ర దినోత్సవం రోజున దేశంలో పలు చోట్ల ఏకకాలంలో దాడులు చేసేందుకు ప్లాన్ వేశారు ముష్కరులు.

అంతేకాదు బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6 బ్లాక్ డే రోజున కూడా అనేకచోట్ల పేలుళ్లకు స్కెచ్ వేసినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా ఈ పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేయగా.. వారిలో హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌కు చెందిన వైద్యుడు అహ్మద్‌ మొహియుద్దీన్‌ సయ్యద్‌ కూడా ఉండటం సంచలనం రేపుతోంది.

Next Story