- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజ్రీవాల్కు బిగ్ షాక్.. చర్యలకు సిద్ధమైన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, జస్టిస్ స్వర్ణకాంత శర్మపై ఆరోపణలు చేసిన కేసులో కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, జస్టిస్ స్వర్ణకాంత శర్మపై ఆరోపణలు చేసిన కేసులో కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పై మాత్రేమే కాకుండా ఆప్ నేతలు మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ లపై సైతం కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు తనపై అత్యంత దారుణమైన పదజాలంతో, పరువు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అన్నారు. ఇది న్యాయవ్యవస్థపై దాడికి పల్పడటమేనంటూ మండిపడ్డారు. ఎక్సైజ్ పాలసీ కేసును వేరే బెంచ్ విచారిస్తుందని, ఈలోగా తన కుటుంబానికి సంబంధించిన కేసు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసును తాను విచారిస్తున్నానని చెప్పారు.
తాను కోర్టు ధిక్కరణ విచారణను ప్రారంభించినందున, లిక్కర్ పాలసీ కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయడం మంచిదని అన్నారు. కేసు విచారణలో ఉండగానే సోషల్ మీడియాలో తనపై వ్యతిరేక ప్రచారం మొదలైందని తెలిపారు.అంతేకాకుండా కోర్టును లక్ష్యంగా చేసుకున్న కథనాలు ప్రసారం చేశారని ఇది రాజకీయ శక్తులు చేయించిన ప్రచారం అని ఆరోపించారు. మార్ఫింగ్ చేసిన వీడియోలతో తన కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగి నిందలు వేశారన్నారు. ఇది తనను మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థనే బయపెట్టడానికి జరిగిందని అన్నారు. హైకోర్టు ఆదేశాల తరవాత కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేసును కేజ్రీవాల్ సోషల్ మీడియాకు తీసుకువెళ్లారని ఆరోపించారు. ఒక లా కాలేజీలో తాను మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేశారని చెప్పారు. కేజ్రీవాల్ తనను బెదిరించలేరని స్పష్టం చేశారు.






