- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్.. షోకాజు నోటీసులు ఇచ్చిన NAAC
రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్డెస్క్: రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఉగ్రదాడిలో అరెస్టయిన వారిలో ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన ముగ్గురు డాక్టర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలు అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కాలేజీలు NAAC (National Assessment and Accreditation Council) ఆమోదం పొందకపోయినా.. పొందాయంటూ యజమాన్యం వెబ్సైట్లో ప్రదర్శిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లుగా తేలింది. దీంతో నాకే, అల్-ఫలాహ్ యూనివర్సిటీపై చర్యలకు ఉపక్రమించి చేసిన తప్పుకు తాజాగా షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇచ్చిన నోటీసులపై 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని.. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని NAAC ప్రతినిధులు అల్-ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.






