ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. శనివారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. అయితే, పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చైతన్య శర్మ మరియు దేవిందర్ కుమార్ భుట్టోలపై ఫిబ్రవరి 29న అనర్హత వేటు పడింది. దీంతో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘంగా ఆలోచించి కాంగ్రెస్‌కు షాకిచ్చారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోన్న కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed