- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSS పరువునష్టం కేసులో రాహుల్కు రిలీఫ్
ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రిలీఫ్ లభించింది. ఆయనకు భీవండి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దిశ, వెబ్డెస్క్: ఆర్ఎస్ఎస్ 2014 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రిలీఫ్ లభించింది. ముంబై భీవండి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే 2014లో దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా రాహుల్ గాంధీ భీవండీ కోర్టు ఎదుట హాజరయ్యారు.
గతంలో గ్యారెంటర్గా ఉన్న శివరాజ్ పాటిల్ చాకూర్కర్ మరణించడంతో, ఆయన స్థానంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ను కొత్త గ్యారెంటర్గా రాహుల్ గాంధీ నియమించారు. సప్కాల్ను హామీదారుగా కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కౌన్సెల్ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన సాగుతోందని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో తాము కోర్టుకు సహకరిస్తున్నామని తెలిపారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, విచారణను ఎదుర్కొని నిజాన్ని కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారని ఆయన పేర్కొన్నారు.






