- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరగతి గదిలోకి తుపాకీతో చొరబడ్డ వ్యక్తి..
by Vinod kumar |
ఓ గుర్తు తెలియని వ్యక్తి మాల్దా జిల్లా ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి తుపాకీతో చొరబడ్డాడు.

X
మాల్దా: ఓ గుర్తు తెలియని వ్యక్తి మాల్దా జిల్లా ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి తుపాకీతో చొరబడ్డాడు. అయితే పోలీసులు అతనిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఓల్డ్ మాల్దాలోని ముచియా ఆంచల్ చంద్ర మోహన్ హై స్కూలులో ఈ భయానక దృశ్యం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ చూపిస్తూ కేకలు వేయడం ప్రారంభించాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
‘ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి 8వ తరగతి గదిలోకి దూసుకెళ్లాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. గట్టిగా కేకలు వేస్తూ క్లాస్ టీచర్ను చంపుతానని బెదిరించాడు’ అని ఆ అధికారి చెప్పారు. అయితే వెంటనే అతడిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత క్లాస్లను రద్దు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story






