కూలీకి రూ.75 లక్షల లాటరీ ప్రైజ్.. కానీ అతను చేసిన పనికి అందరు షాక్!

by Disha Web Desk 17 |
కూలీకి రూ.75 లక్షల లాటరీ ప్రైజ్.. కానీ అతను చేసిన పనికి అందరు షాక్!
X

తిరువనంతపురం: కేరళలో బెంగాల్ కూలీ పంట పండింది. తాను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టు ద్వారా రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గెలిచిన ఆనందంలో ఏమి చేయాలో తెలియక పోలీస్ స్టేషన్ వెళ్లాడు. ఆరా తీయగా తన డబ్బులకు భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పాడు. బెంగాల్ కు చెందిన ఎస్కే బాదేష్ కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్త్రీ శక్తి లాటరీ రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. ఆ వెంటనే మువట్టుపుజా పోలీస్ స్టేషన్ కి పరిగెత్తి తన ప్రైజ్ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు.

అయితే నిబంధలను తెలియకపోవడం వల్లే అయోమయానికి గురై రక్షణ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు అతని పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలోనూ పలుమార్లు టికెట్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. బాదేష్ అక్కడ రోడ్ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నాడు.



Next Story

Most Viewed