సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడికి బెయిల్!

by Dishanational2 |
సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడికి బెయిల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్‌కు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. ఈయనకు కోర్టు మరణ శిక్ష విధించడంతో.. గత 30 ఏళ్లుగా జైలులో ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి కి అభ్యర్థించగా.. ఆయన తిరస్కరించడంతో నిరాశ చెంది.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం.. పేరరివాలన్ ఆరోగ్య పరిస్థితులను, 30 ఏళ్ల జైలు జీవితంలో ఆయన సత్ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story