చార్ ధామ్ యాత్రికులకు బ్యాడ్ న్యూస్..

by Disha Web Desk 12 |
చార్ ధామ్ యాత్రికులకు బ్యాడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో అనూహ్యంగా భారీ ఎత్తున్న మంచు కురుస్తుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మార్గమధ్యంలో ఉన్న యాత్రికులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, యాత్రికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. అలాగే ముందస్తుగా రాత్రి బస కోసం ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారిని మాత్రం రుద్రప్రయాగ్ వైపు వెళ్లడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే పాస్‌లు బుక్ చేసుకోని ప్రయాణికులు శ్రీనగర్‌లోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు" అని ఎస్‌హెచ్‌ఓ శ్రీనగర్ రవి సైనీ తెలిపారు.

Next Story

Most Viewed