ACITI భాగస్వామ్యం ప్రకటించిన ఆస్ట్రేలియా–కెనడా–భారత్

by Malleboina Mahesh |

సౌతాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన G20 సమ్మిట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ACITI భాగస్వామ్యం ప్రకటించిన ఆస్ట్రేలియా–కెనడా–భారత్
X

దిశ, వెబ్ డెస్క్: సౌతాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన G20 సమ్మిట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథనీ అల్‌బనీజ్, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఒక కీలక ప్రకటన చేశారు. మూడు దేశాలు కలిసి ఆస్ట్రేలియా–కెనడా–ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ACITI) భాగస్వామ్యం ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త త్రైపాక్షిక భాగస్వామ్యం (Tripartite partnership) ద్వారా ఉన్నత సాంకేతికత, శుభ్ర ఇంధనం, సరఫరా సుంకాల వైవిధ్యీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వంటి రంగాల్లో మూడు ప్రజాస్వామ్య దేశాలు మరింత కలిసి పనిచేయనున్నాయి. మూడు ఖండాలు, మూడు మహాసముద్రాలు కలిపే ఈ భాగస్వామ్యం భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని సృష్టించడం లో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడుతూ ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Next Story