నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు

by Disha Web Desk 4 |
నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో చెరో 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయలో 3,419 కేంద్రాల్లో పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగాలాండ్ లో 2,291 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరభారత దేశంలోని ఈ రెండు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీల పొత్తుతో బీజేపీ అధికారంలో ఉంది.

కాగా ఈ సారి మేఘాలయలో బీజేపీ ఒంటరిగానే పోటీకి దిగుతుండటం గమనార్హం. 56 సీట్లలో ఎన్‌పీపీ తమ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలపడంతో పోటీ రసవత్తరంగా సాగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో 34లక్షల మంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు.

Next Story

Most Viewed