- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అస్సాం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్పై దాడి?

- కాంగ్రెస్ ఎమ్మల్యే దాడి చేశాడని బీజేపీ ఆరోపణలు
- తాను నిరసన మాత్రమే వ్యక్తం చేశానన్న నూరుల్ హుడా
- హుడాపై కేసు బుక్ చేయాలని స్పీకర్కు సీఎం శర్మ వినతి
దిశ, నేషనల్ బ్యూరో: అస్సాం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నూరుల్ హుడా సభ వెలుపల దాడి చేశాడని అధికార బీజేపీ ఆరోపించింది. ఈ అంశంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేశారు. కాగా, తాను మోమిన్పై దాడి చేయలేదని.. నిరసనలో భాగంగా సభకు వెళ్లే మార్గాన్ని మాత్రమే అడ్డుకున్నానని హుడా వివరించారు. గత వారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యే రూప జ్యోతి కుర్మీ తీవ్రంగా దుర్భాషలాడి, భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ సభ్యులు శాసన సభ్యులు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. సభ ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్ శాసన సభ్యులు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల చాంబర్లకు వెళ్లే మార్గంలో ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో అక్కడకు డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ను హుడా అడ్డుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ మోమిన్ నుంచి తనకు వాట్సప్ సందేశం అందింది. నూరుల్ హుడా తనపై దాడి చేశాడని.. తాను ఆసుపత్రిలో చేరినట్లు సందేశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. సభ వెలుపల జరిగిన దాడి సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి స్పీకర్ను కోరుతున్నట్లు సీఎం బిస్వా శర్మ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. కాగా, దాడికి కొన్ని నిమిషాల ముందు మోమిన్ సభలో కూర్చున్నారు. కొంత సమయం తర్వాత ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు దేబబత్ర సైకియా స్పందించారు. ఈ సంఘటన అసెంబ్లీ భవనంలో జరిగిందని చెప్పారు. కాబట్టి పోలీసులకు బదులుగా హౌస్ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.