నోట్లు విసురుతూ హల్చల్ చేసిన కార్యకర్తలు... నెట్టింటా వైరల్

by Dishanational1 |
నోట్లు విసురుతూ హల్చల్ చేసిన కార్యకర్తలు... నెట్టింటా వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పలు సీట్లను కైవసం చేసుకుందంటూ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అయితే, ఆ సమయంలో ఆ సంబరం కొద్దిగా మితిమీరిపోయింది. అదేమంటే సంబరాల్లో వారు రోడ్లపై కరెన్సీ నోట్లు జల్లుతూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... నాగాలాండ్ లోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ) ఇతర పార్టీల కంటే అధిక సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడి ఇంటి ముందు సంబురాలు చేసుకున్నారు. అయితే, ఆ సమయంలో రోడ్లపై కరెన్సీ నోట్లు జల్లారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ చూసి సీరియస్ అవుతున్నారు.

Next Story