- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వం అనేది కేవలం మగవారికి సంబంధించినదనే ట్యాగ్ ను తప్పనిసరిగా తొలగించాలని అన్నారు. పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశంలో మధ్యవర్తిత్వ పాలనను ఎలా మెరుగుపరచాలనే దానిపై తన సూచనలను పంచుకుంటూ, స్థిరపడిన పేర్లకు అనుకూలంగా మంచి అభ్యర్థులు తరచుగా విస్మరించబడతారని అన్నారు. గురువారం ఢిల్లీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభ సెషన్లో సీజేఐ మాట్లాడారు.
విశ్రాంత న్యాయమూర్తులు మధ్యవర్తిత్వంలో అద్భుతంగా పని చేస్తున్నారు. కానీ మధ్యవర్తులను నియమించేటప్పుడు మేము రిటైర్డ్ న్యాయమూర్తుల వైపు మాత్రమే చూడలేము. మరింత స్థిరమైన పేరు కోసం విస్మరించబడిన చాలా మంది ఆశాజనక అభ్యర్థులు ఉన్నారు' అని అన్నారు. పెద్ద పెద్ద వాణిజ్య సంబంధిత వివాద పరిష్కారాల్లో మాత్రమే కాకుండా చిన్న వ్యాపారా వివాదాల్లోనూ మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సాహించాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే దీనిలోనూ సాంకేతిక, వర్చువల్ హియరింగ్ లను చేర్చాలని సీజేఐ కోరారు. దీని వల్ల ఖర్చు తగ్గి పార్టీలు చేరే ప్రక్రియ మెరుగవుతుందని తెలిపారు. గత కొన్నేళ్లుగా సుప్రీంకోర్టు కూడా పార్టీ స్వయంప్రతిపత్తిని ఎత్తి చూపుతుందని సీజేఐ అన్నారు. ఎందుకంటే మధ్యవర్తిత్వానికి ఇదే ముఖ్యమని చెప్పారు.






