- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్: ఒడిషాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్
దిశ, వెబ్డెస్క్: ఒడిషాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 280 మంది వరకు మరణించగా.. మరో 1000 మంది ప్రయాణికులకు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనలో సహయక చర్యలు కొనసాగుతుండగా.. అదే ఒడిషా రాష్ట్రంలో మరో ట్రైన్ పట్టాలు తప్పడం సంచలనంగా మారింది. సోమవారం ఒడిషాలో మరో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది.
బారాగఢ్ జిల్లాలో ఈ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గూడ్స్ రైలు ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. సున్నపు రాయి లోడ్తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అటు వైపు నుంచి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్నఅధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. పక్కకు ఒరిగిన బోగీలను ట్రాక్పై నుండి తొలగిస్తున్నారు. ఈ గూడ్స్ రైలు ప్రమాదం వల్ల ఆ రూట్లో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read: మచిలీపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు.. చైన్ లాగడంతో