నన్ను బెదిరిస్తున్నారు.. తీహార్ జైలు నుంచి సుఖేష్ మరో సంచలన లేఖ

by Disha Web Desk 14 |
నన్ను బెదిరిస్తున్నారు.. తీహార్ జైలు నుంచి సుఖేష్ మరో సంచలన లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీహార్ జైల్లో ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖను విడుదల చేశారు. జైలు అధికారులు కొంతమంది వారితో కుమ్మక్కు అయ్యారని, దీంతో జైల్లో తనను కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

అధికార దుర్వినియోగం చేసిన వారికి జైల్లో పోస్టింగ్ ఇచ్చారని వెల్లడించారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు అత్యంత సన్నిహితుడిని జైలు అధికారిగా నియమించుకున్నారని ఆరోపించారు. జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారని, స్టేట్ మెంట్ ఇవ్వొదంటూ ఒత్తిడి తెస్తున్నారన్నారని ఆరోపించారు. ఎవరు బెదిరించినా వెనక్కి తగ్గనని, నేతల బండారం మొత్తం బయట పెడతానని సుఖేష్ లేఖలో పేర్కొన్నారు.



Next Story