కేంద్రం మరో కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్‌గా అలోక్‌ జోషి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 08:44:02  IST  )

జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్‌గా అలోక్‌ జోషి
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌గా మాజీ RAW చీఫ్ అలోక్‌ జోషిని నియమించింది. అదేవిధంగా బోర్డు సభ్యులుగా సైనిక సేవల నుంచి మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, మాంటీ ఖన్నా, ఇక ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి మాజీ ఐఏఎస్ రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, ఐఏఎఫ్ అధికారి వెంకటేశ్ వర్మ లాంటి సీనియర్ రిటైర్డ్ అధికారులు నియమితులయ్యారు.

Next Story