Android Phones: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం బిగ్ అలర్ట్..!

by Maddikunta Saikiran |   (  Updated:2024-11-26 17:55:09  IST  )

భారతదేశం(India)లో గత కొంత కాలంగా సైబర్ నేరగాళ్ల(Cyber criminals) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.

Android Phones: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం బిగ్ అలర్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో గత కొంత కాలంగా సైబర్ నేరగాళ్ల(Cyber criminals) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హ్యాకర్లు మొబైల్ యూజర్ల(Mobile Users)ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా యూజ్ చేసుకొని వినియోగదారులపై సైబర్ అటాక్స్‌(Cyber ​​Attacks)కి తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్(Android) ఆపరేటింగ్ సిస్టమ్స్‌(OS) ఫోన్లు వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 12 నుంచి ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్(Security Problems) ఉన్నాయని గుర్తించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ(E&IT) మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In)’ అడ్వైజరీని జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే యూజర్ల భద్రతకు తీవ్ర స్థాయిలో ముప్పు వాటిల్లే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. యూజర్ల ఫోన్లలో ఆండ్రాయిడ్ అప్డేట్స్(Android Updates) రాగానే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

Next Story