- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amit Shah: ఆయిల్, గ్యాస్ కొరత లేదు..మా ప్రభుత్వాన్ని నమ్మండి !
ఇండియాలో ఎలాంటి సమస్య రాదని.. గ్యాస్, ఆయిల్ కొరత ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా.

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ వ్యాప్తంగా చమురు, LPG కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ లైన్ లో నిత్యం కనిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పదే పదే కేంద్ర ప్రభుత్వం, ఎవరు ఆందోళన చెందకూడదని కోరుతోంది. లేటెస్ట్ గా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో ఎలాంటి సమస్య రాదని.. గ్యాస్, ఆయిల్ కొరత ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. కొంత మంది తప్పుడు ప్రచారం.. దాని వల్ల జనాలు భయాందోళనకు గురికాకూడదని కోరారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని జనాలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు అమిత్ షా. ఏ యుద్ధంలోనూ ఇండియా జోక్యం చేసుకోవాలని కోరుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్ధ సంక్షోభం ఉన్న నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించినట్లు వివరించారు. సంక్షేమం భారాన్ని తనపై వేసుకున్న మొట్టమొదటి దేశం ఇండియా అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా చేయలేదని తాజాగా ఓ సమ్మిట్ లో వెల్లడించారు అమిత్ షా.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా రియాక్షన్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా రియాక్ట్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. టీఎంసీ అవినీతి, అరాచక పాలనపై బెంగాల్ ప్రజలు విసిగిపోయినట్లు తెలిపారు. ఈ తరుణంలోనే బీజేపీ అధికారంలోకి రాబోతుందని వ్యాఖ్యానించారు.






