- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amarnath: ముగిసిన అమర్నాథ్ యాత్ర.. వారం రోజుల ముందే నిలిపివేత
వారం రోజుల ముందు గానే అమర్ నాథ్ యాత్ర ముగిసింది. జమ్మూ కశ్మీర్లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: వారం రోజుల ముందు గానే అమర్ నాథ్ యాత్ర (Amarnath yathra) ముగిసింది. జమ్మూ కశ్మీర్లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా యాత్రా మార్గాలు చాలా దెబ్బతిన్నాయని, బాల్టాల్, పహెల్గాం మార్గాల్లో మరమ్మతు పనులు జరుగుతాయి కాబట్టి యాత్రను నిలిపివేస్తున్నట్టు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురీ (Vijaykumar bidhuri) తెలిపారు. యాత్రను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి అన్ని మార్గాల్లో యాత్రను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, అమర్ నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9 వరకు యాత్ర కొనసాగాలి. కానీ వాతావరణ పరిస్థితుల ముందస్తుగానే రద్దు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.10 లక్షల మంది భక్తులు అమర్నాథ్ను సందర్శించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 5లక్షల మంది అమరనాథ్ ఆలయాన్ని సందర్శించారు.






