ఫేజ్-1 నుంచే బీజేపీ ఓటమి మొదలు: అఖిలేష్ యాదవ్

by Dishanational1 |
ఫేజ్-1 నుంచే బీజేపీ ఓటమి మొదలు: అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా మొదలవుతున్న తొలి దశ పోలింగ్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేజ్-1 పోల్సింగ్ నుంచే బీజేపీ ఓటమి మొదలవుతుందని అన్నారు. రాజ్‌పుత్‌లు, క్షత్రియుల ఆగ్రహావేశాలు బీజేపీని, పార్టీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. 'ఓటు వేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ చెప్పే అన్నీ విషయాలు అబద్దాలే. ఆ పార్టీ ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలే చేస్తుంది. కాబట్టి తొలి దశ ఓటింగ్ నుంచే బీజేపీ ఓటమిని ఎదుర్కొంటుందని' వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫేజ్-1 ఓటింగ్‌లో యూపీ ప్రజల స్పందన ఎస్పీకి స్పష్టమైన విజయాన్ని ఇస్తుందని అన్నారు. బీజేపీకి స్పష్టమైన సందేశం ద్వారా వాస్తవాలను తెలియజేస్తారని తెలిపారు. బీజేపీ, ఎన్డీయేకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పీడీఏకు ప్రజలు అండగా ఉంటారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed