Air India: ఎన్నికల వేళ ఎయిరిండియా బంపర్ ఆఫర్.. వాళ్లకు మాత్రం టికెట్‌పై 19 శాతం డిస్కౌంట్

by Disha Web Desk 1 |
Air India: ఎన్నికల వేళ ఎయిరిండియా బంపర్ ఆఫర్.. వాళ్లకు మాత్రం టికెట్‌పై 19 శాతం డిస్కౌంట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎయిరిండియా వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటేసే యువత దాదాపుగా లక్షల్లో ఉన్నారు. ఈ క్రమంలో వారంతా ఓటేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళ్లనున్నారు. దీంతో బస్సులు, రైళ్ళల్లో ప్రత్యేక ఆఫర్లును ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ తోవలో ఎయిరిండియా కూడా తన ఆఫర్‌ను ప్రకటించింది. తమ విమాన సర్వీసుల్లో ప్రయాణించే ఫస్ట్ టైం ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్‌ సర్వీసుల టికెట్‌ ధరలపై ఏకంగా 19 డిస్కౌంట్ ప్రకటించింది. కానీ, ఆఫర్‌ను వినియోగించుకువాలంటే వ్యక్తి వయసు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల లోపు వారై ఉండాలి. మొబైల్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 నుంచి మాత్రమే ప్రయాణం చేయాలంటూ నిబంధనలు పెట్టింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌ ఇలా నాలుగు కేటగిరీలకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.

Next Story

Most Viewed