బెంగళూరుకు చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే.. స్వాగతం పలికిన సిద్ధరామయ్య, డీకే

by Javid Pasha |
బెంగళూరుకు చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే.. స్వాగతం పలికిన సిద్ధరామయ్య, డీకే
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలు పార్టీలు ఎన్డీఏకు చెక్ పెట్టి తాము అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు విపక్ష పార్టీలు ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో సమావేశం నిర్వహించనున్నాయి. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు.

వారికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు సీనియర్ నేతలు స్వాగతం పలికారు. ఇక ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో మొత్తం 24 పార్టీల నాయకులు హాజరుకానున్నారు. వారిలో జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వీ యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖంగ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు పాల్గొననున్నారు.

Next Story

Most Viewed