అగ్నివీర్లు నాలుగేళ్లకే రిటైరవ్వాలి.. మోడీ 73 ఏళ్లయినా రిటైర్ కారా ? : మీసా భారతి

by Dishanational4 |
అగ్నివీర్లు నాలుగేళ్లకే రిటైరవ్వాలి.. మోడీ 73 ఏళ్లయినా రిటైర్ కారా ? : మీసా భారతి
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ ఉండేది కటకటాల వెనుకే’’ అంటూ లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ఆమె ప్రధానిపై ఫైర్ అయ్యారు. ‘‘ఆర్మీలో అగ్నివీర్‌లుగా రిక్రూట్ అయ్యే యువత నాలుగేళ్లలోనే రిటైరయ్యి ఇళ్లలో కూర్చోవాలట. మోడీ మాత్రం 73 ఏళ్లు దాటిన దేశాన్ని పాలిస్తారట. ఇదేం న్యాయం. ప్రజలేం మూర్ఖులు కారని ప్రధాని తెలుసుకోవాలి. వారు తగిన సమాధానం ఇస్తారు’’ అని మీసా భారతి కామెంట్ చేశారు. పాట్నా సమీపంలోని పాలిగంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీసా భారతి 2014, 2019 ఎన్నికల్లో పాటలీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ సీటు నుంచి బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ గెలిచారు. ప్రస్తుతం మీసా భారతి రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీగా ఉన్నారు.

Next Story

Most Viewed