- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తొమ్మిదేళ్ల తర్వాత భారత్కు పాక్ నాయకుడు
దిశ, డైనమిక్ బ్యూరో: తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్కు చెందిన నాయకుడు ఒకరు భారత్కు రానున్నారు. మే 4,5 తేదీల్లో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ-ఎస్ సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్కు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ సమదస్సుకు హాజరుకావాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. బిలావల్ భుట్టో జర్దారీని ఆహ్వానించారని పాక్ అధికారులు తెలిపారు. కాగా 2014లో నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్కు రావడం ఇదే తొలిసారి అవుతుంది.
2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దాంతో అప్పటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జర్దారీ పర్యనట ఆసక్తిగా మారింది.