ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్

by Sujitha Rachapalli |

ఎఫ్ఐఆర్ నుంచి పేరును తొలగించేందుకు కోటి లంచం అడిగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఢిల్లీ మారిస్ నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ జైన్.. సోనిపట్‌కు చెందిన

ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎఫ్ఐఆర్ నుంచి పేరును తొలగించేందుకు కోటి లంచం అడిగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఢిల్లీ మారిస్ నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ జైన్.. సోనిపట్‌కు చెందిన ఫిర్యాదు దారుని పేరు కేసు నుంచి రిమూవ్ చేసేందుకు, ఎఫ్ఐఆర్ నుంచి ఓ సెక్షన్‌ను తొలగించేందుకు కోటి రూపాయాలు అడిగాడు. కానీ పలు చర్చల తర్వాత రూ. 70లక్షలకు ఒప్పుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆగస్టు 2న తన సహచరుడికి రూ. 30లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ ఆఫీసర్స్. సోనిపట్‌ జీ3 స్కూల్ దగ్గర స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఏసీబీ.. అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు ఏసీబీకి సమాచారం అందించడంతో ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇక ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచిన అధికారులు.. ఒక్కరోజు కస్టడీలోకి తీసుకున్నారు.

VIDEO

Next Story