పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్.. మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన ఇరాన్

by Kema Shiva Kumar |

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ పాత్రను ఇరాన్ తిరస్కరించింది.

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్.. మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన ఇరాన్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో నెలకొన్న ఉద్రిక్తతల వేల దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు ఊహించని షాక్ తగిలింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య రాజీ కుదిర్చేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధికారికంగా తోసిపుచ్చింది. తమకు తెలియకుండానే పాక్ ఆ చర్చల వేదికలను ఏర్పాటు చేసుకుందని ఇరాన్ (Iran) విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, పాకిస్థాన్ ఏర్పాటు చేసిన దౌత్య వేదికలు వారి సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. ఆ చర్చల్లో ఇరాన్ ఎప్పుడూ భాగస్వామి కాలేదని.. అసలు తాము అందులో పాల్గొననే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా, ఇరాన్, అమెరికా (America) మధ్య పెరుగుతున్న ఘర్షణలను నివారించేందుకు పాక్ ఓ మధ్యవర్తిగా వ్యవహరించాలని భావించింది. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి సానుకూలత రాకపోవడంతో ఆ ప్రయత్నాలు నీరుగారాయి. అమెరికాతో తాము ఎటువంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని ఇరాన్ వెల్లడించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిస్తున్న ప్రతిపాదనలు అర్థం లేని విధంగా ఉన్నాయని ఇరాన్ ఆరోపించింది.

Next Story