బిర్యానీ తినే వారికి షాక్.. పిల్లుల మాంసంతో బిర్యానీ

by Disha Web Desk 6 |
బిర్యానీ తినే వారికి షాక్.. పిల్లుల మాంసంతో బిర్యానీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న కాలంలో జనాలు బిర్యానీని చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటున్నారు. కొంత మంది ప్రతి రోజూ బిర్యానీ తిని జీవనం కొనసాగించే వారు కూడా ఉంటున్నారు. బిర్యానీని తినకుండా అస్సలు ఉండలేరు. ఇటీవల బిర్యానీలో బల్లులు, బొద్దింకలు వచ్చినా బిర్యానిని తినడం మానడం లేదు. తాజాగా, చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లుల మాంసంతో బిర్యానీ తయారుచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలో ఓ ఇద్దరు వ్యక్తులు పిల్లులను పట్టడం పుష్పవాణి అనే మహిళ గమనించింది. వారిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె చెప్పిన స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ విస్తుపోయే విషయాలు కనిపించాయి. బోనులో 11 పిల్లులు ఉన్నాయి. వాటిని జంతు సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆ ఘటనపై కొంత మందిని విచారించి కొన్ని విషయాలను సేరించారు. ఓ టీమ్ ఉదయం పూట పిల్లులను దొంగతనం చేయడానికి వెళ్లి వాటిని పట్టుకొచ్చి మాంసాన్ని మటన్‌లో కలిపి హోటళ్లకు, రోడ్లపై ఉన్న దుకాణాలకు విక్రయిస్తారని తెలిపారు.



Next Story

Most Viewed