వ్యక్తిని కాటేయగానే చనిపోయిన విషపూరిత పాము.. కారణం ఏంటంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-20 06:25:20  IST  )

సాధారణంగా పాములు కాటేస్తే తొందరగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

వ్యక్తిని కాటేయగానే చనిపోయిన విషపూరిత పాము.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా పాములు కాటేస్తే తొందరగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక, కొన్నిసార్లు విషపూరిత పాములు కాటేస్తే ఆ వ్యక్తి బతకడం కష్టమనే చెబుతుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ ఖుద్సోడిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సచిన్ అనే యువకుడిని విషపూరిత పాము కాటేసిన అతనికి ఏం కాలేదు. అంతేకాదు అతన్ని కాటేసిన విషపూరిత పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసిన.. ఇది చాలా అరుదైన ఘటనని బలంగా కాటేసినప్పుడు పాము కోరల పై ఒత్తిడి ప్రభావంతో అది మరణించవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ ఘటన పై సచిన్ స్పందిస్తూ.. పలు ఔషధ మూలికలతో పళ్లు తోముకుంటానని రక్తంలో ఔషధాలు మిళితమై ఉన్నందునే ఇలా జరిగొండచ్చని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

Next Story